హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’ సినిమాతో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఈనెల 8న వరల్డ్వైడ్ రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ సుభాష్ చంద్ర మీడియాతో సినిమా విశేషాలను షేర్ చేసుకున్నారు.
హీరో సుమంత్ని సునీల్ నారంగ్, జాన్వి నారంగ్ రిఫర్ చేశారు. వాళ్లు మా నిర్మాతకి పార్ట్నర్స్. సుమంత్కి కథ చాలా నచ్చింది. ఈ సినిమాలో సుమంత్ది గోదావరి అబ్బాయి పాత్ర. గోదారి యాసను పర్ఫెక్ట్గా పలికారు.
ఈ కథ మన జీవితాల్లో చూసినదే. ప్రతి ఇంట్లో తండ్రి–కూతురు ఉంటారు, వారి మధ్య ప్రేమ ఉంటుంది. అలాగే ఇద్దరు ప్రేమికుల మధ్య ప్రేమ కూడా ఉంటుంది. ఈ రెండింటినీ ట్రయాంగిల్ ఫార్మ్లో చూపించాను. సినిమా అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటుంది. ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.
ఈ సినిమాలో జగపతిబాబు పాత్రను మా బాబాయి పాత్ర నుంచి ఇన్స్పిరేషన్తో రాసుకున్నాను. సినిమాలో ఆయన వాడిన బండి కూడా మా బాబాయిదే. ప్రతి తండ్రికీ తన కూతురికి తనకంటే బెటర్ వ్యక్తిని ఇవ్వాలని ఉంటుంది. ఇది ఆయన ప్రేమలో ఉన్న నిజం. అలాగే అబ్బాయి ప్రేమలోనూ నిజం ఉంటుంది. అలాంటి అంశాన్ని ఇందులో చెప్పాలని ప్రయత్నించాం. ఎన్ని తరాలు మారినా ప్రేమ ఎమోషన్ ఒకటే. ఈ కథను చాలా పరిణతితో ట్రీట్ చేశాం.
కథానాయిక నిధి ప్రదీప్కి భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది. కొన్ని సీన్లు ఇచ్చినప్పుడు చాలా అద్భుతంగా చేసింది. ఆమె కళ్లలో మంచి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఈ పాత్రకు ఆమె పర్ఫెక్ట్ అనిపించింది.
లైలా అంటే ‘ఎగిరే పావురమా’ చూసినప్పటి నుంచి ఇష్టం. ఇందులో జగపతిబాబుతో ఆమె కాంబినేషన్ కొత్తగా ఉంటుంది. ఆయనకు ఎదురుగా నిలబడే హుందాతనం ఉన్న పాత్ర కావాలి. ఇందులో ఆమె చాలా ముఖ్యమైన పాత్ర చేశారు. జగపతిబాబు, లైలా, రాజీవ్ కనకాల వంటి అనుభవజ్ఞులైన నటులు కథను నమ్మి ఈ సినిమాలో చేశారు.
ఈ సినిమాకు నాగ వంశీ అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఒక రెట్రో సాంగ్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఈ సినిమాతో ఆ అవకాశం దొరికింది. చిత్ర, ఎస్పీ చరణ్తో ఆ పాటను పాడించడం మర్చిపోలేని అనుభూతి. నిర్మాత అభినవ్ చాలా ప్రొఫెషనల్. మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.
మన జీవితాల్లో చూసిన కథే..
- Advertisement -
- Advertisement -



