Thursday, January 15, 2026
E-PAPER
Homeఖమ్మంసీపీఐ(ఎం) సీనియర్ నాయకులు జయరాజ్ మృతి

సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు జయరాజ్ మృతి

- Advertisement -

-నివాళులర్పించిన పోతునేని, సుబ్బారావు

నవతెలంగాణ కల్లూరు : మండల పరిధిలోని చెన్నూరు గ్రామానికి చెందిన సీపీఐ (ఎం) సీనియర్ నాయకులు కొలికి పోగు జయరాజు అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, సీనియర్ నాయకులు ఎం. సుబ్బారావు, తాత భాస్కరరావు జయరాజ్ భౌతికకాయంపై పార్టీ జెండా కాప్పి నివాళులర్పించారు. జయరాజు చెన్నూరు గ్రామంలో సీపీఐ(ఎం) బలోపేతానికి ఎనలేని కృషి చేశారని ఆయన మృతి పార్టీకి తీరని లోటని పోతినేని గుర్తు చేశారు. భౌతిక గాయాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో ఆ పార్టీ సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి సేలం సత్యనారాయణ రెడ్డి, మండల కార్యదర్శి మాదాల వెంకటేశ్వరావు, మండల రైతు సంఘ కార్యదర్శి ముదిగొండ అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు రావి సూర్యనారాయణ, సూర్యనారాయణ, గ్రామ నాయకులు కొలికిపోవు సర్వేశ్వరరావు, రామనాథం, వెంకట్, బీరెల్లి పుల్లయ్య, హుస్సేన్, కొడుకులు, కుమార్తెలు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -