Sunday, May 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దళిత బంధువుడు మంత్రి శ్రీధర్ బాబు 

దళిత బంధువుడు మంత్రి శ్రీధర్ బాబు 

- Advertisement -

కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య 
మౌలిక వసతులకు రూ.15 కోట్లు
నవతెలంగాణ-కాటారం 

మంథని నియోజకవర్గంలోని దళిత వాడల్లో సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణాలకు సీఆర్‌ఆర్‌ (ఎస్సీ కంపోనెంట్) కింద రూ.15 కోట్లు మంజూరు చేయించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు. కాటారం మండల కేంద్రంలో విడుదల చేసిన ప్రకటనలో, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నిధులు దళిత వాడల్లో మౌలిక వసతుల మెరుగుదలకు దోహదం చేస్తాయని అన్నారు. వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేయాలని స్థానిక నాయకత్వం, ఇంజినీరింగ్ అధికారులను కోరారు. రాబోయే ఎన్నికల్లో దళితులు ప్రజాపాలనకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -