- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు టౌను
గ్రామీణ క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా సీఎం కప్ పనిచేస్తుందని, తహసిల్దార్ వి ఆంజనేయులు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల అన్నారు. ఎంపీడీవో సత్య ఆంజనేయ ప్రసాద్ తో కలిసి ,ఆలేరు పట్టణంలో శనివారం తెలంగాణ క్రీడా ,జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ క్రీడా మైదానం నుండి ,సీఎం కప్ కార్యక్రమం లో భాగంగా, ఆలేరు పట్టణంలో హైస్కూల్ నుండి, కనకదుర్గ ఆలయం వరకు ఉపాధ్యాయులు ,క్రీడాకారులు, విద్యార్థులు కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎర్ర లక్ష్మి, పిఈటి జి మధు, వివిధ పాఠశాలల ల పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



