- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్ ( రాజంపేట్ )
రాజంపేట పట్టణ కేంద్రంలో శనివారం 2వ ఎడిషన్ ముఖ్యమంత్రి కప్–2025 టార్చ్ ర్యాలీ మండల అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ర్యాలీ గ్రామ ప్రధాన వీధుల గుండా నిర్వహించి క్రీడల ద్వారా యువతలో ఆరోగ్యం క్రమశిక్షణ ఐక్యత పెంపొందితాయని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలకృష్ణ, ఎమ్మార్వో, ఎంఈఓ పూర్ణచందర్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, యువజన సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
- Advertisement -



