- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో నగరంలో జీరో విజిబులిటీ నమోదైంది. గాలి కాలుష్యం 439 నుంచి 500 పాయింట్లకు చేరడంతో ప్రభుత్వం గ్రేడ్-4 ఆంక్షలు విధించింది. పొగమంచు కారణంగా విమానాలు, పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు విమానయాన సంస్థల వెబ్సైట్లలో సమాచారం చూసుకోవాలని సూచించింది. బేర్లీ, లక్నో, కుశీనగర్లలో జీరో విజిబులిటీ, అమృత్సర్, గోరఖ్పూర్లలో 100 మీటర్లు, ప్రయాగ్రాజ్లో 200 మీటర్ల విజిబులిటీ నమోదైనట్లు ఐఎండీ తెలిపింది.
- Advertisement -



