- Advertisement -
బాత్రూంలో జారిపడి, చికిత్స పొందుతూ మృతి
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని రెడ్డి పేట గ్రామానికి చెందిన గోపు రాములు (46) గల్ఫ్ కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపు రాములు దాదాపు 20 సంవత్సరాల నుండి గల్ఫ్ కార్మికునిగా బహరన్ లో ఉంటూ పని చేస్తున్నాడు. వారం రోజుల క్రితం బాత్రూంలో జారి పడటంతో, గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. ఆదివారం మృతదేహం గ్రామానికి చేరుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
- Advertisement -



