నవతెలంగాణ – జుక్కల్
బాన్సువాడ మండలంలోని బోర్లలో అతి పురాతనమైన బసవన్న ఆలయము పూర్వికులు నిర్మించారు. ఈ సందర్భంగా ఇక్కడ మొక్కులు తీసుకునేందుకు జుక్కల్ మద్నూర్ బిచ్కుంద మండలాల నుంచి భారీ సంఖ్యలో వీర శైవ లింగాయత్ లు భక్తులు భారీగా తరలివస్తుంటారు. నేడు ఆదివారం అమావాస్య కావడంతో శివాలయానికి భారీగా భక్తులు వచ్చి చేరారు. ఈ కార్యక్రమానికి అన్నదాతగా బసవన్న అన్న ప్రసాదం ఆవల్గావ్ గ్రామానికి చెందిన చీలావార్ సుకుమార్ పటేల్ ఆధ్వర్యంలో మహా అన్నదాన ప్రసాదం నిర్వహించారు.
ఆలయానికి వచ్చిన వందలాది భక్తులకు మా అన్నదాని ప్రసాదం నైవేద్యంగా స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి చెందిన కమిటీ సభ్యులు జిల్లా ప్రసిడెంట్ కే . దిగంబర్ అన్న ప్రసాదం ఏర్పాట్లు చేసిన శివకుమార్ను శాలువాతో సన్మానించి ఆలయ కమిటీ వారు బసవన్న ప్రవచనాల సంబంధించిన పుస్తకాలను , గ్రంథాలను అందించారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ మారుతి పటేల్ , సూర్యకాంత్ పటేల్, బసవరాజ్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.



