- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన రాజారాం ఎస్సైగా కామారెడ్డి అర్బన్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఈరోజు తిరిగి జుక్కల్ మండలంలోని సొంత గ్రామానికి తిరిగి రావడంతో గ్రామానికి నూతనంగా ఎన్నికైన కొత్త గ్రామ సర్పంచ్ బుక్కావార్ ఆశ చందర్ పాటిల్ ఆధ్వర్యంలో గ్రామస్తులు గ్రామ పెద్దలు కలిసి ఎస్సై రాజారామ్ ను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. సన్మాన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుక్ కవర్ ఆశ చందర్ , బండి వారి పండరి , నారాయణ రావు, అశోక్ పటేల్ , రాజు పటేల్, చందర్ పటేల్, మాజీ సర్పంచ్ పడంపల్లి పౌవుడే సులోచన గంగాధర్ , మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



