Sunday, January 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐక్యతతోనే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాదిద్దాం

ఐక్యతతోనే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాదిద్దాం

- Advertisement -

డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్
నవతెలంగాణ – బిచ్కుంద 

జిల్లా వ్యాప్తంగా రాబోయే కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐక్యతతో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ అన్నరు. బిచ్కుంద పట్టణంలోని వ్వవసాయ మర్కెట్ కార్యాలయ సమీపంలో నిర్వహించిన  సమావేశంలో మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం అధికారికంగా బలపరిచిన చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకోవడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ విజయాల కోసం  నిజాయితీగా శ్రమించే ప్రతి నాయకులకు కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సముచిత అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అలాగే భవిష్యత్తులో ఇచ్చే నామినేటెడ్ పోస్టుల్లోనూ పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.పార్టీలో ఎవరికీ అన్యాయం జరగకుండా, కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ ప్రక్రియ మొత్తం జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ  ఎమ్మెల్యేలు మరియు స్థానిక ఇన్‌చార్జిల సమన్వయంతో సాగుతుందని అన్నారు.

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను గెలిపించి, ఆ విజయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు  మహేష్ కుమార్ గౌడ్  గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహుమతిగా అందించాలనే సంకల్పంతో పని చేయాలి అని వారు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ర్ పార్టీ శ్రేణుల ఐక్యతే బలం: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
వ్యక్తిగత అభిప్రాయాలు, అంతర్గత భేదాభిప్రాయాలను పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా అందరూ ఒక్కటిగా పనిచేయాలని పార్టీ శ్రేణుల ఐక్యతే కాంగ్రెస్ బలమని, ఆ ఐక్యతతోనే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

పార్టీ ఐక్యతే లక్ష్యం – కాంగ్రెస్ విజయమే ధ్యేయం అనే నినాదంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన వెంట మండల అధ్యక్షులు దర్పల్ గంగాధర్, సర్పంచులు గోపాల్ రెడ్డి పటేల్, సురేష్ గొండ, నాయకులు మున్నూరు నాగనాథ్, సోపాన్ సార్, అసద్ అలి, ప్రేమ్ కుమార్ సెట్, నౌషా నాయక్, విట్టల్ రెడ్డి, నాగనాథ్ పటేల్, తుకారం, సాయిలు, ఖలీల్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -