Thursday, May 7, 2026
E-PAPER
Homeజాతీయంమ‌రోసారి గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన‌ విజ‌య్

మ‌రోసారి గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన‌ విజ‌య్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మ‌రోసారి త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌ను రాజేంద‌ర్ విశ్వ‌నాథ్ అర్లేక‌ర్‌ను టీవీకే అధినేత విజ‌య్ క‌లిశారు. 11 గంట‌ల‌కు లోక్ భ‌వ‌న్ కార్యాలయానికి వెళ్లారు. ప్ర‌భుత్వ ఏర్పాటు కోసం అవ‌కాశం ఇవ్వాల‌ని గ‌వ‌ర్న‌ర్‌ను కోరారు. అయితే బుధ‌వారం కూడా స్వయంగా విజ‌య్ ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిశారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు త‌గిన బ‌లముంద‌ని విన‌తి ప‌త్రం కూడా అంద‌జేశారు. కానీ గంట‌ల వ్య‌వ‌ధిలోనే గ‌వ‌ర్న‌ర్‌కు షాక్ ఇచ్చారు. ప్ర‌భుత్వ ఏర్పాటు కావాల్సిన 118 ఎమ్మెల్యేల సంఖ్య‌ను తెలియ‌జేయాల‌ని సూచించారు. తాజాగా ఈరోజు మ‌రోసారి అర్లేక‌ర్‌ను టీవీకే అధినేత విజ‌య్ క‌లువ‌నున్నారు.

234 అసెంబ్లీ స్థానాలకు టీవీకే 107 సీట్ల‌ను కైవ‌సం చేసుకున్న విష‌యం తెలిసిందే. మ్యాజిగ్ ఫిగ‌ర్ నెంబ‌ర్ 118కి అతి చేరువ‌లో నిలిచిపోయింది. అయితే టీవీకే అభ్య‌ర్థ‌న మేర‌కు ఐదుగురు ఎమ్మెల్యేలున్నా కాంగ్రెస్ విజ‌య్‌కు మ‌ద్ద‌తు తెలిపింది. అయినా కానీ ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ రాక‌పోవ‌డంతో త‌మిళ‌నాడులో నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈక్ర‌మంలోనే డీఎంకే- అన్నాడీఎంకే క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఊహ‌గానాలు తెర‌మీద‌కు వ‌చ్చాయి. అయితే డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ విజ‌య్ ప్ర‌భుత్వ ఏర్పాటును అడ్డుకోబోమ‌ని స్ప‌ష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -