నవతెలంగాణ-మద్నూర్
మండుతున్న ఎండలకు ప్రజలకు దాహం తీర్చేందుకు మద్నూర్ మండలంలోని పెద్ద తడ్గురు గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలి కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ శాంతవ్వ గురువారం ఈరన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోజురోజుకు పెరుగుతున్న ఎండలకు బస్టాండ్ సమీపంలో ప్రజలు దాహం కోసం తల్లడిల్లకుండా ప్రజల అవసరాల కోసం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హన్మగౌడ్, జీపీ కార్యదర్శి, రవికుమార్, పంచాయతీ కారోబాగ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు మండుతున్న ఎండలకు ప్రజలు నీటి కోసం బస్టాండ్ సమీపంలో తల్లడిల్లకుండా ప్రజలకు ఈ సౌకర్యాన్ని కల్పించడం సర్పంచ్ కు పంచాయతీ పాలకవర్గానికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
పెద్ద తడగూర్ లో చలివేంద్రం ఏర్పాటు చేసిన సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



