Monday, January 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి ఇంటికి బీఆర్‌ఎస్ బాకీ కార్డులు చేరవేయాలి

ప్రతి ఇంటికి బీఆర్‌ఎస్ బాకీ కార్డులు చేరవేయాలి

- Advertisement -

బీఆర్‌ఎస్ ఎన్నికల అబ్జర్వర్ మఠం బిక్షపతి పిలుపు
నవతెలంగాణ – సదాశివపేట

బీఆర్‌ఎస్ పార్టీ రూపొందించిన బాకీ కార్డులను విస్తృతంగా ప్రతి ఇంటికి చేరవేసి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని బీఆర్‌ఎస్ ఎన్నికల అబ్జర్వర్, మాజీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ మఠం బిక్షపతి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం సదాశివపేట పట్టణంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల కనీస అవసరాలను కూడా తీర్చలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు.

మహిళలకు నాలుగు నెలలుగా పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో పాటు ఐదు లక్షల సహాయం ఇస్తామని ఇచ్చిన హామీని కూడా మర్చిపోయారని అన్నారు. వికలాంగులకు నెలకు రూ.6,000 పెన్షన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేదని పేర్కొన్నారు.

ఉచిత బస్సు పథకం వల్ల మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజల మద్దతుతో బీఆర్‌ఎస్ ఘన విజయం సాధించి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగడానికి వస్తే, బీఆర్‌ఎస్ బాకీ కార్డుల ద్వారా ప్రజలకు వాస్తవాలు వివరించడం ప్రతి కార్యకర్త బాధ్యత అని సూచించారు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ప్రతి ఆడబిడ్డకు ఒక తులం బంగారం అందించాలన్న హామీని తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు చిల మల్లన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి పిలిగుండ్ల వీరేశం, మాజీ మున్సిపల్ చైర్మన్ శివరాజ్ పాటిల్, వైస్ చైర్మన్ చింతా గోపాల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడూరి రమేష్, మాజీ అధ్యక్షులు సుధీర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పెద్ద గొల్ల ఆంజనేయులు తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -