- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలం నాగుల్గవ్ గ్రామంలో యాదు మేస్త్రి నూతన గృహప్రవేశం కార్యక్రమానికి జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే హాజరయ్యారు. పిలిచిన వెంటనే వచ్చినందుకు గృహ యజమాని షిండేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమం లో జుక్కల్ మండలం బీఆర్ఎస్ యువ డైనమిక్ నాయకులు లాడేగావ్ గ్రామ సర్పంచ్ రాజశేఖర్ పటేల్, లొంగన్ గ్రామ సర్పంచ్ ఉషారాణి సద్దు పటేల్, మాజీ సర్పంచులు కపిల్ పటేల్, రవి పటేల్, బిఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


