నవతెలంగాణ – ఆర్మూర్
స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన నలుగురిని (4) కోర్టులో హాజరు పరచగా, ( 3) ముగ్గురిని ఒక్కొక్కరికి జిఎఫ్సిఎం మేజిస్ట్రేట్ భావ్యశ్రీ ఏడు రోజుల (7) సాధారణ శిక్ష విధించినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ సోమవారం తెలిపారు. పట్టణానికి చెందిన తమ్మిశెట్టి శ్రీనివాస్ , గుంజ కోటేశ్వరరావు , భూ రెడ్డి కొండారెడ్డి లకు ఒక్కరికి (1) రూ.10000/-జరిమానా సైతం విధించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ మాట్లాడుతూ.. వాహనదారులు తమ వాహనాలకు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనదారులకు మోటార్ వెహికల నూతన చట్ట ప్రకారం భారీగా జరిమాణాలు పెంచిందని తెలిపారు. వాహనదారులు విధిగా ధ్రువపత్రాలు తమ దగ్గర ఉంచుకోవాలని సూచించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పలువురికి జైలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



