Friday, May 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సాగునీరు అందించడమే నీటిపారుదల శాఖ లక్ష్యం

సాగునీరు అందించడమే నీటిపారుదల శాఖ లక్ష్యం

- Advertisement -

– నీటిపారుదల శాఖ ఈఈ మోడెం సత్యనారాయ
నవతెలంగాణ-తుంగతుర్తి
రైతులకు సాగునీరు అందించడం, నీటి వృధాను అరికట్టడం, కాలువల్లో పూడికతీత, మరమ్మతులు చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి నీటిపారుదల శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఈఈ మోడెం సత్యనారాయణ అన్నారు. ప్రజాపాలన..ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని దేవునిగుట్టతండ గ్రామపంచాయతీలో స్థానిక సర్పంచ్ గుగులోత్ స్వాతి భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖపై రైతులకు అవగాహన కల్పించి మాట్లాడారు.

రైతులకు సాగునీరు అందించడం, భూగర్భ జలాలను పెంచడం, పాత ప్రాజెక్టులను ఆధునికరించడం ఈ శాఖ ప్రధాన లక్ష్యాలు అన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలు ఆయిల్ ఫామ్, ఉద్యాన పంటలు వేసుకోవాలని సూచించారు. ప్రజాపాలనలో భాగంగా,క్షేత్రస్థాయిలో ఉన్న నీటి వనరులను కాపాడుకుంటూ, సాగునీటిని సద్వినియోగం చేసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, డిఈఈలు కిష్టయ్య, సునిత, ఏఈఈలు కళ్యాణ్, సతీష్, హరీష్, చంద్రశేఖర్, అఖిల్, హారిక, శివ, మహేంద్ర బాబు, విక్రమ్, లస్కర్లు రజనీకాంత్, హుస్సేన్, నాగేష్, వెంకన్న, శివ, మహేష్, సాయికుమార్, శ్రీను గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -