Friday, May 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – ధర్పల్లి
మండలంలోని సీతాయిపేట్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి గోదాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహం ప్రతిష్ఠాపన మహోత్సవంలో శనివారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటూ.. ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజల పై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి గ్రామాభివృద్ధికి తనవంతుగా సహాయసహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు.

వివాహానికి హాజరైన ఎమ్మెల్యే
అంతకు ముందు ధర్పల్లి మున్నూరుకాపు కల్యాణ మండపంలో జిన్నా లచ్చారెడ్డి కుమారుడి వివాహానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు  ఆర్మూర్ బాల్ రాజు, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయరెడ్డి, పొలసాని శ్రీనివాస్,సీతాయిపేట సర్పంచ్ సిహెచ్ భూమేష్, మాజీ సర్పంచ్ లోక్కిడి విజయ రాములు, ఆశన్న, భూమన్న, బుజ్జి, మనోహర్ రెడ్డి, భగవంత్ రెడ్డి, సుభాష్ రెడ్డి, జాన్ రెడ్డి, దర్పల్లి, హోన్నజీపేట సొసైటీ చేర్మెన్లు చెలిమేల మల్లికార్జున్, జనార్దన్ రెడ్డి, రాంచందర్ గౌడ్, నరేష్, ఆయా గ్రామాల సర్పంచులు గాదె నరేష్, శేఖర్ గౌడ్, సభవత్ రమేష్, బాలు నాయక్, మధు, రాజేందర్,ఏఎంసి  మంగీత్య నాయక్, కట్టా గంగమోహన్, వాడి గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -