Tuesday, January 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హంగర్గా పాఠశాలను సందర్శించిన కామారెడ్డి జిల్లా పరిషత్ సీఈఓ 

హంగర్గా పాఠశాలను సందర్శించిన కామారెడ్డి జిల్లా పరిషత్ సీఈఓ 

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని హంగార్గా గ్రామ ములోని జడహెచ్ఎస్ పాఠశాలను కామారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ సీఈవో చందర్ నాయక్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం ఎలా ఉందో అని విద్యార్థినీ విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాల ఆవరణలో అభ్యంతరంగా నిలిచిపోయిన టాయిలెట్లు, బాత్రూంలో విషయంలో ఆరా తీశారు. జిపి పరిధిలో నిర్వహించిన ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ప్రభుత్వం అందిచే సంక్షేమ పథకాలను ఎలా కొనసాగిస్తున్నారు అని  అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ తో పాటు ఎంపీడీవో శ్రీనివాస్, ఎంఈఓ తిరుపతయ్య, గ్రామ పంచయతీ సెక్రెటరీ  అశోక్ గౌడ్,  ఉపాధ్యాయ బృందం , వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -