Wednesday, January 21, 2026
E-PAPER
Homeసినిమాయూనిక్‌ కాన్సెప్ట్‌తో..

యూనిక్‌ కాన్సెప్ట్‌తో..

- Advertisement -

పూరి జగన్నాథ్‌, హీరో విజరు సేతుపతి మోస్ట్‌ ఎవైటెడ్‌ పాన్‌-ఇండియా మూవీ ‘స్లమ్‌ డాగ్‌ 33 టెంపుల్‌ రోడ్‌’. షూటింగ్‌ పూర్తయిన ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్‌-ప్రొడక్షన్‌ దశలో ఉంది. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌ పై పూరి జగన్నాథ్‌, చార్మీ కౌర్‌, జెబి మోహన్‌ పిక్చర్స్‌ జెబి నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి నిర్మిస్తున్నారు.
దునియా విజయ్ కుమార్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించ నున్నారు. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్రబృందం ఆయన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.
ఈ సినిమాలో విజరు సేతుపతి సరసన సంయుక్త కథా నాయికగా నటిస్తుండగా, టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్‌లు హ్యుమరస్‌ పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఐదు భాషలలో గ్రాండ్‌ పాన్‌-ఇండియా రిలీజ్‌ కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -