నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలోని వర్జీనియాలో నివాసముంటున్న హైదరాబాద్ యువతి ముద్దసాని వీణ (28) ఫ్లోరిడాలోని స్నేహితురాలి ఇంట్లో ఈతకొలనులో మృతి చెందింది. ఇంజినీరింగ్ పూర్తి చేసి, 2023 జూన్ 1న ప్రశాంత్రెడ్డిని వివాహం చేసుకున్న వీణ, ఆగస్టులో అమెరికా వెళ్లింది. ఇటీవల కొత్త ఇల్లు కొనుగోలు చేసి, వచ్చే నెల 5న గృహప్రవేశానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ నెల 7న స్నేహితురాలి ఇంట్లోని ఫంక్షన్కు వెళ్లిన వీణ, అదే రోజు ఈతకొలనులో మృతి చెందినట్లు శనివారం సమాచారం అందింది. తన కుమార్తెకు ఈత వచ్చినా మృతి చెందడం అనుమానాస్పదంగా ఉందని, ప్రమాదం ఎలా జరిగిందో చెప్పడం లేదని మృతురాలి తండ్రి దేవేందర్రెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
యుస్ లో స్విమ్మింగ్ పూల్లో మునిగి హైదరాబాద్ యువతి మృతి
- Advertisement -
- Advertisement -



