Thursday, January 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గడువు పొడిగించిన ప్రభుత్వం 

గడువు పొడిగించిన ప్రభుత్వం 

- Advertisement -

గురుకులాల డీసీఓ విజయ లలిత వెల్లడి
నవతెలంగాణ- డిచ్ పల్లి

రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో నూతన సంవత్సరం సీట్ల భర్తీకి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువు తేదీని జనవరి 25 వరకు పొడిగించడం  జరిగిందని డీసీఓ విజయ లలిత తెలిపారు. ఈమేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇదివరకు జనవరి 21 వరకు ఉన్న చివరి తేదీని ప్రభుత్వం జనవరి 25 వరకు పొడిగించినట్లుగా ఆమె తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని, అర్హత కలిగిన విద్యార్థులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరీక్ష తేదీ ఫిబ్రవరి 22 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కల్పన, నవనీత, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -