Thursday, January 22, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పోడు రైతును చితకబాదిన ఎఫ్ఎస్ఓ రవీందర్ ను సస్పెండ్ చేయాలి

పోడు రైతును చితకబాదిన ఎఫ్ఎస్ఓ రవీందర్ ను సస్పెండ్ చేయాలి

- Advertisement -

నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో అర్ధరాత్రి సీపీఎం ధర్నా
నవతెలంగాణ – ఖానాపూర్
: కక్షగట్టి దాడి భార్య భర్తలు ఇద్దరినీ అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెట్టారని. వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాత్రి 9 గంటలకు ఖానాపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ముందు సిపిఎం పార్టీ ధర్నా చేసింది ధర్నాలో సిపిఎం నిర్మల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్, బొమ్మెనసురేష్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని తర్లపాడు గ్రామ పోడు రైతు బోసు భూమన్న అనే వ్యక్తిని రాత్రి 7 గంటలకు ఖానాపూర్ ఎఫ్ఎస్ఓ రవీందర్, బీట్ ఆఫీసర్ నరేందర్ అరెస్టు చేసి చిత్రహింసలు పెడుతున్నారని ఆయన అన్నారు.

30 సంవత్సరాలుగా సాగులో ఉన్నటువంటి భూమిని గత ఆరు సంవత్సరాల కింద ఒకసారి 2025 జూన్ లో మరోసారి ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకొని పోలం గట్లపై ఉన్నటువంటి మామిడి చెట్లను తొలగించి వాటి రూపురేఖలు కనబడకుండా చేసి రైతుపై కక్షగట్టి దాడి చేస్తున్నారు. దీనిని ప్రజలు ప్రజాస్వానికి వాదులు ఖండించాలని ,ఫారెస్ట్ ఎఫ్ఎస్ఓ రవీందర్ ని వెంటనే సస్పెండ్ చేయాలని పోడు రైతుకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే సాగులో ఉన్న పోడు భూముల జోలికి వెళ్లొద్దని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పదేపదే చెబుతున్న ఫారెస్ట్ అధికారులు పెడచెవిన పెడుతున్నారని అన్నారు.

30 సంవత్సరాలుగా సాగులో ఉన్న ఈ పోడు భూమిని ఈ రైతు ఎందుకు వదులుకోవాలనారు. రాష్ట్రంలో ఒక పద్ధతి ఖానాపూర్ లో ఈ ఫారెస్ట్ అధికారులు మరో పద్ధతిగా కొనసాగుతున్నది. వెంటనే బోసు భూమన్నను మరియు అతని భార్య లక్ష్మి వెంటనే వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగేల్లి నర్సయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -