- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్. జానకి ఏకైక కుమారుడు మురళీకృష్ణ కన్నుమూశారు. ఆయన ఆకస్మిక మరణ వార్తను సింగర్ కె.ఎస్. చిత్ర సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మురళీకృష్ణ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఈ బాధాకరమైన సమయంలో జానకి అమ్మకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కె.ఎస్. చిత్రం భావోద్వేగంగా పోస్ట్ చేశారు. అలాగే తాను ప్రేమగల సోదరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మురళీకృష్ణ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



