Thursday, January 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బిల్లులు చెల్లించాలని పాఠశాల గదలకు తాళం

బిల్లులు చెల్లించాలని పాఠశాల గదలకు తాళం

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
మన ఊరు మనబడి పథకం కింద మండల పరిధిలోని నడింపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.40 లక్షల ఖర్చు చేసి డైనింగ్ హాలు, అదనపు గదులు శేఖర్ అనే కాంట్రాక్టర్ పనులు నవంబర్ నెలలోనే పూర్తి చేశాడు. బిల్లులు చెల్లించాలని శుక్రవారం అదనపు గదులకు తాళం వేసి కాంట్రాక్టర్ నిరసన వ్యక్తం చేశారు. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనులు అచ్చంపేటలో గర్ల్స్ హై స్కూల్ నిర్మాణానికి రూ.95 లక్షలు, ఆశ్రమ పాఠశాలల నిర్మాణానికి రూ.25 లక్షలు, అయ్యవారిపల్లి పాఠశాలలో రూ.32 లక్షలు అప్పులు తెచ్చి ఖర్చు చేసి అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. బిల్లులు బకాయిలు ఉండడంతో ఆర్థికంగా అప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాంట్రాక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ పరిస్థితిని అర్థం చేసుకొని జిల్లా కలెక్టర్ నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -