– పేట లో మకాం వేసిన ఎమ్మెల్యే జారె
– సమన్వయం కోసం ఓ యువ నాయకుడి మధ్యవర్తిత్వం
నవతెలంగాణ – అశ్వారావుపేట
మున్సిపాల్టీ ఎన్నికల నిర్వహణలో నోటిఫికేషన్ సమయం దగ్గర పడుతున్నా కాంగ్రెస్ లో సీట్ ల సర్దుబాటు కొలిక్కి వచ్చే టట్లు కనిపించడం లేదు. దీంతో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గత మూడు రోజులుగా అశ్వారావుపేట తన అధికారిక నివాసంలోనే అధిక సమయం గడుపుతూ చర్చోపచర్చలు,బుజ్జగింపులు,గెలుపు గుర్రాల కోసం వ్యూహాలు పన్నుతున్నారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ లో పాత – కొత్త వర్గాలు మధ్య సమన్వయం కోసం సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు,స్థానిక సీనియర్ నాయకున తనయుడు అయిన ఒక యువ నాయకుడు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 22 వార్డులకు 11 మహిళల కోటా కావడం,చైర్మన్ పీఠం జనరల్ మహిళ కు రిజర్వ్ కావడంతో ప్రధాన పార్టీ ల నాయకులు వారి సహచరి లను రంగంలోకి దించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
కొత్తగా ఏర్పడిన మున్సిపాల్టీ కి తొలిసారి ఎన్నికలు జరగడంతో ఈ పోటీలో నెగ్గి “ప్రధమ చైర్మన్” రికార్డ్ ను సొంతం చేసుకోవాలని పలువురు నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు.


