జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్డీవో
నవతెలంగాణ-కాటారం
కాటారం ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన డి. రవీందర్ బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆర్డీవో రవీందర్కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో సమర్థవంతంగా పనిచేయాలని, ప్రజలకు పారదర్శకంగా మరియు వేగవంతమైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఆర్డీవో డి. రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తానని, రెవెన్యూ పరిపాలనలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు.
కాటారం ఆర్డీవోగా డి. రవీందర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



