Wednesday, May 13, 2026
E-PAPER
Homeజాతీయంస్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు–మళ్లీ రూపాయి పతనం

స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు–మళ్లీ రూపాయి పతనం

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: దేశీయ షేర్‌ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి. బుధవారం ప్రారంభంలో నష్టాల్లోకి జారుకున్న సూచీలు.. చివరికి కొనుగోళ్ల మద్దతుతో కోలుకున్నాయి. ముఖ్యంగా లోహ, చమురు, వాయు రంగాలకు చెందిన షేర్లు మార్కెట్‌కు ఊతమిచ్చాయి. జాతీయ స్టాక్‌ సూచీ 24,400 మార్క్‌కు పైగా ముగియగా, విదేశీ మారకద్రవ్య విపణిలో రూపాయి విలువ మరింత బలహీనపడింది. ఒక దశలో డాలరుతో మారకం విలువ రూ.95.80 వద్దకు చేరుకుని కొత్త కనిష్ఠాన్ని నమోదు చేసింది. ముంబయి స్టాక్‌ సూచీ సెన్సెక్స్‌ గత ముగింపు 74,559.24 పాయింట్లతో పోలిస్తే 74,439.34 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. రోజంతా తీవ్ర ఒడుదొడుకులకు లోనైన సూచీ.. ఇంట్రాడేలో 74,134.48 నుంచి 75,191.57 పాయింట్ల మధ్య భారీగా కదలాడింది.

రూపాయి విలువ డాలరుతో పోలిస్తే 95.71గా నమోదు
చివరికి 49.74 పాయింట్లు పెరిగి 74,608.98 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 33.05 పాయింట్లు లాభపడి 23,412.60 వద్ద ముగిసింది. విదేశీ మారకద్రవ్య విపణిలో రూపాయి విలువ డాలరుతో పోలిస్తే 95.71గా నమోదైంది. సెన్సెక్స్‌ సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, బీఈఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీల షేర్లు లాభాల్లో నిలిచాయి. మరోవైపు మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, సన్‌ ఫార్మా, టెక్‌ మహీంద్రా కంపెనీల షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ ముడి చమురు ధర బ్యారెల్‌కు 107 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు ధర 4701 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -