- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శుక్రవారం వాటరింగ్ డే కార్యక్రమాన్ని చేపట్టగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ హాజరై మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మొక్కలు పెంచడం వాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. వాటరింగ్ డే కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జె . అశోక్ పాటిల్, సాయిబాబా, అవినాష్ ,మేనూరు ఎఫ్ ఏ మాధవ్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



