Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు ఓటుహక్కుపై అవగాహన

విద్యార్థులకు ఓటుహక్కుపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా మండలంలోని పెద్దతూoడ్ల గ్రామం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు బి.తిరుపతి, ఉపాధ్యాయులు, బిఏల్ఓలు ముందస్తుగా విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించి, ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి సంవత్సరం జనవరి 25 తేదీన ఓటర్ల దినోత్సవం జరుపుకుంటామని,18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. అలాగే ఓటును ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా, నిర్భయంగా ఓటు వేయాలన్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు బాధ్యతయుతమైన పౌరులుగా దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మానస, సుజాత, ఐత మహేందర్, గోపి నాయక్, చంద్ర ప్రకాష్ ,రవీందర్, ఒ.ఎస్ సందీప్, బి ఎల్ ఓ లు అన్నపూర్ణ, రేష్మా, ఆశ వర్కర్ ఉమా  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -