ఆలేరు గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి
శ్రీరామగిరి పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జి కే రమేష్
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని ఆలేరు గ్రామంలో శ్రీరామగిరి పిఎసిఎస్ ఆధ్వర్యంలో సేల్ పాయింట్ ను ప్రారంభించినట్లు ఆ గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం శ్రీరామగిరి పిఎసిఎస్ పర్సన్ ఇంచార్జి కే రమేష్ తో కలిసి సమావేశం ఏర్పాటు చేసి ఫర్టిలైజర్ సేవలను సద్వినియోగం చేసుకునే దానిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాంత రైతులు ఎక్కడికో దూర ప్రాంతాలకు పోయి మందు బస్తాల కోసం ఇబ్బంది పడుతున్నారని అలా పడకూడదనే ఉద్దేశంతో ఈ ఆలేరు గ్రామ పరిధిలో ఒక షాపును ఏర్పాటు చేయాలని ఈ సెంటర్ ను ప్రారంభించామని అన్నారు.
రైతులు దీనిని సద్వినియోగం చేసుకొని రైతంగం పంట లకు సరిపోను మందు బస్తాలు తీసుకొని అధిక దిగుబడి వచ్చే విధంగా రైతాంగం కృషిచేసి ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పాయింట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో, ఏఈఓ మణికంఠ తొర్రూర్ ఎఎంసి మార్కెట్ డైరెక్టర్ కాలేరు మల్లేశం శ్రీరామగిరి సొసైటీ సీఈఓ కత్తుల వెంకన్న సిబ్బంది గండి వెంకన్న శ్రీరాo రంజిత్ మాల్సూర్ అలీ వివిధ గ్రామాల సర్పంచ్ ఉప సర్పంచ్లు పాల్గొన్నారు.



