నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియంలో నెల 21 నుండి 23 వరకు మూడు రోజుల పాటు జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ అండర్-17 బాల బాలికల విభాగంలో టోర్నమెంట్ విజేతలుగా నిజామాబాద్ జట్టు నిలిచాయి.
బాలుర విభాగంలో ప్రథమ స్థానం నిజామాబాద్, ద్వితీయ స్థానం వరంగల్, తృతీయ స్థానం అదిలాబాద్ జట్లు గెలుపొందాయి. బాలికల విభాగంలో ప్రథమ స్థానం నిజామాబాద్, ద్వితీయ స్థానం మెదక్, తృతీయ స్థానం మహబూబ్ నగర్ జట్లు గెలుపొందాయి. ఈ సందర్భంగా జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగమణి మాట్లాడుతూ ఈ టోర్నీలో ఎంపికైన క్రీడాకారులు ఫిబ్రవరి 4 నుండి 9 వరకు ఛత్తీస్గడ్ రాష్ట్రం బిలాస్పూర్ లో జరిగే 69వ జాతీయ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు.
కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య బహుమతులను ప్రధానం చేశారు. జట్టుకు సీల్డ్ తో పాటు క్రీడాకారులకు మెడల్స్ ను అందజేశారు. కాగా రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ విజేతలకు అందించిన షీల్డ్ లను, మెడల్స్ లను స్థానిక నూతికట్టు విక్రమ్ విరాళంగా అందజేశారు.



