- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం జమ్మూ కాశ్మీర్లోని పూంఛ్ జిల్లాకు చేరుకున్నారు. పాకిస్తాన్ క్రాస్బోర్డర్ షెల్లింగ్ వల్ల ప్రభావితమైన బాధితులను ఆయన కలుసుకున్నారు. పాక్ షెల్లింగ్ బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. షెల్లింగ్ వల్ల దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. వారికి మద్దతుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
- Advertisement -