Saturday, January 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసంక్రాంతి విన్నర్‌గా నిలబెట్టారు

సంక్రాంతి విన్నర్‌గా నిలబెట్టారు

- Advertisement -

హీరో శర్వా నటించిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అడ్వెంచర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. ఈనెల14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుని హౌస్‌ ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ సంక్రాంతి విన్నర్‌ బ్లాక్‌ బస్టర్‌ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో టీం అందరికీ షీల్డ్స్‌ అందించారు. హీరో శర్వా మాట్లాడుతూ,’ ఈ సినిమాని అద్భుతంగా ఆదరించిన ప్రేక్షకులకు, ఈ టైటిల్‌ ఇచ్చి ముహూర్తం పెట్టిన మా బాలయ్య బాబుకి హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్ననే బాలయ్యతో మాట్లాడాను. నా పేరు నిలబెట్టావ్‌ అన్నారు. నెక్స్ట్‌ సినిమా నుంచి మీరే ముహూర్తం పెట్టాలని అడిగాను.

ముందుగా శ్రీ విష్ణుకి థాంక్స్‌. చివర్లో కామియో రోల్‌ చేయడం శ్రీ విష్ణు గొప్ప మనసు. ఒక హీరో సినిమాని, ఫ్రెండ్షిప్‌ని నమ్మి చేయడం అనేది మామూలు విషయం కాదు. అనిల్‌ ప్రొడక్షన్స్‌లో మా ఇద్దరికి కలిసి ఒక కథ రాస్తే తప్పకుండా చేస్తాం. చిన్నితో పదేళ్ళ అనుబంధం. ఆయనతో సినిమా చేయాలి. కానీ ఆయన రాజకీయాల్లోకి వెళ్లారు. ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. సుదర్శన్‌ నాకు చాలా మంచి ఫ్రెండ్‌. ఇందులో తన క్యారెక్టర్‌ని ఆడియన్స్‌ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. భాను, నందు రైటింగ్‌కి చాలా మంచి పేరు వచ్చింది. రామ్‌ నెక్స్ట్‌ జనరేషన్‌కి చాలా మంచి డైరెక్టర్‌ అవుతాడు. జంధ్యాల, ఈవివి తర్వాత ఇప్పుడు అప్‌ కమింగ్‌లో తను ఉన్నాడు. మా కెమెరామెన్‌ అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చాడు. ప్రేక్షకులు గొప్ప విజయాన్ని మాకు ఇచ్చారు. ఈ సినిమా ఇక్కడితో ఆగదు. మరో నాలుగు వారాలు అద్భుతంగా ఆడుతుంది. ఇప్పుడు నుంచి టాక్‌ స్టార్ట్‌ అయింది. థియేటర్స్‌ పెంచాం. ఈ ఫ్రై డే నుంచి మేమేంటో చూపిస్తాం’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -