Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గృహ గణనలలో వివరాలను కచ్చితంగా నమోదు చేయాలి....

గృహ గణనలలో వివరాలను కచ్చితంగా నమోదు చేయాలి….

- Advertisement -

– జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

జనగణన–2027 గృహగణన కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. గురువారం అనంతారం గ్రామంలో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు నిర్వహిస్తున్న గృహగణన సర్వేను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.  ఇంటింటికి వెళ్లి వివరాల నమోదు ప్రక్రియ, హౌస్ లిస్టింగ్ విధానం, కుటుంబాల వివరాల సేకరణ తదితర అంశాలను పరిశీలించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జనగణన 2027 అత్యంత కీలకమైందని తెలిపారు. సర్వే నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్ల  జనగణన నమోదు చేసేటప్పుడు తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు. అందువల్ల ప్రజలు తమ కుటుంబ సభ్యుల వివరాలను సరైన విధంగా అందించి సహకరించాలని కోరారు. అధికారులు, ప్రజల సమన్వయంతో జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -