Saturday, January 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబిడ్డను నరబలి ఇచ్చిన తల్లికి ఉరిశిక్ష రద్దు..!

బిడ్డను నరబలి ఇచ్చిన తల్లికి ఉరిశిక్ష రద్దు..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : 2021లో సూర్యాపేట జిల్లాలో మూఢనమ్మకంతో 7 నెలల పసికందును నరబలి ఇచ్చిన కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితురాలు బానోత్ భారతికి దిగువ కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేసింది. ఘటన సమయంలో భారతి తీవ్రమైన మానసిక అనారోగ్యంతో ఉందని, ఏం చేస్తుందో కూడా తెలియని స్థితిలో ఉన్నందున నేరం వర్తించదని స్పష్టం చేసింది. ఆమెను తక్షణమే మానసిక చికిత్స కేంద్రానికి తరలించాలని ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -