- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కర్నాటకలోని బళ్లారి శివార్లలో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన రూ.3 కోట్ల విలువైన మోడల్ హౌస్కు గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. కిటికీలు, తలుపులు పగులగొట్టి పెట్రోల్తో నిప్పంటించడంతో ఫర్నిచర్ కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



