నవతెలంగాణ-జక్రాన్ పల్లి
మండలంలోని మనొహరబాద్ గ్రామంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సర్పంచ్ ఉప సర్పంచ్ అల్లూరి లక్ష్మి లింబారెడ్డి అందజేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయటం జరిగిందని పంపిణీ చేయడం జరిగిందని సర్పంచ్ తెలిపారు .
కూడాల పెద్ద గంగారంకి రూ.60000, పాట్కూరి గున్నవ్వకి రూ.17000, ఆరే ముని పెళ్లి పోసానికి రూ.15000 పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అల్లూరిలక్ష్మి లింభారెడ్డి, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు కూడల చిన్న గంగారం, కిషన్ కేత్ మండల అధ్యక్షులు బోయి పెద్ద బాలయ్య, గ్రామ కార్యదర్శి గౌతమి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించిన ఎమ్మెల్యేకి గ్రామ ప్రజల తరఫున మా తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.



