నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ సీఎం సువేంద అధికారి నందిగ్రామ్ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. శుక్రవారం అందుకు సంబంధించిన రాజీనామా పత్రాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రథీంద్ర బోస్కు అందజేశారు. గత నెల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సువేంద రెండు నియెజకవర్గాల నుంచి పోటీ చేశారు. నందిగ్రామ్, భవానిపూర్ నుంచి బరిలో నిలిచారు.
అధికారి తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లో, TMC అభ్యర్థి పవిత్ర కర్ పై 9,665 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. అదే విధంగా భవానిపూర్లో మమతా బెనర్జీని కూడా ఆయన ఓడించారు. 15,105 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సువేంద రాజీనామాతో నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 294 మంది సభ్యులు కలిగిన అసెంబ్లీలో 207 స్థానాలను కైవసం చేసుకుంది.



