- Advertisement -
నవతెలంగాణ-కంఠేశ్వర్: ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో ఏఆర్టి సెంటర్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ (01) ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయడానికి అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. అర్హతలు గ్రాడ్యుయేట్ / డిప్లొమా ఇన్ మెడికల్ లాబరేటరీ టెక్నాలజీ (ఎంఎల్టి) ఆసక్తి కల వారు తేదీ 18.05.2026 నుండి 21.05.2026 వరకు ఉదయం10.00 నుడి 03.00 వరకు జిజిహెచ్లో గల ఏఆర్టి సెంటర్ రూమ్ నెంబర్.528, 5వ అంతస్థులో పొందగలరు. పూర్తిచేసిన దరఖాస్తులను తేదీ 21.05.2026 సా: 04.00 వరకు సమర్పించాలన్నారు.
- Advertisement -



