- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. స్వయంపాలన అమలులోకి వచ్చి 77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగం ప్రాముఖ్యతను, తెలంగాణ ఏర్పాటులో ఆర్టికల్ 3 పాత్రను ఆయన గుర్తుచేసుకున్నారు. వివక్షత లేని, సమానత్వంతో కూడిన సమాజం కోసం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దేశం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. తెలంగాణలో రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ నిరంతరం కృషి చేస్తుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
- Advertisement -



