నవతెలంగాణ – ఆలేరు రూరల్
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలేరు మండలం కందిగడ్డ గ్రామంలో గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సర్వనాయక్కు జిల్లా కలెక్టర్ హనుమంతురావు చేతుల మీదుగా ఉత్తమ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా సోమవారం ప్రశంసా పత్రాన్ని అందచేసి అభినందించారు. ఈ సందర్భంగా సర్వర్ నాయక్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, పన్నుల వసూలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థ అమలుకు తాను, తన సిబ్బంది కలిసి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ప్రజల సహకారం వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందని, భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు.
అనంతరం కందిగడ్డ సర్పంచ్ మాలోత్ బోరిలాల్ నాయక్తో పాటు గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ కార్యదర్శి సర్వనాయక్ను శాలువాతో సత్కరించి,పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,అధికారులు పాల్గొన్నారు.



