- Advertisement -
నవతెలంగాణ – ఆత్మకూరు
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం హౌజుబుజుర్గు గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ సయ్యద్ మౌల జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గ్రామసభ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్పు నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపామని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి అమిత్ రెడ్డి, ఉపసర్పంచ్ బోడిగే లక్ష్మి రాంబాబు, వార్డు సభ్యులు నెరెళ్ళ రాజు, పెండల కర్ణాకర్, షేక్ గోరిబీ-హుస్సేన్, సయ్యద్ కరీంబీ-హుస్సేన్, షేక్ కమల్, షేక్ సలీం పాషా, ఎఫ్ఏ చిన్ని పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తరులు పాల్గొన్నారు.
- Advertisement -



