9 ఏళ్ల బీఆర్ఎస్ హయంలో అవినీతిమయం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్

నవతెలంగాణ- భీంగల్
తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేళ్ల పాలనలో బాల్కొండ నియోజకవర్గంలో ఎంతో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు సోమవారం మండలంలోని గోన్ గొప్పుల, సికింద్రాపూర్, బాబాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు నియోజకవర్గంలో అవినీతి అరాచక పాలనను కొనసాగించి ప్రజాధనాన్ని లూటీ చేశారని అన్నారు. తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్లు కొత్త రేషన్ కార్డులు కొత్త పింఛన్లు ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని తెలిపారు. .కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోపు నెరవేరుస్తామని తెలిపారు. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. రైతు భరోసా కింద సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. భూమిలేని రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 సాయం అందిస్తామని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళ ఖాతాలో ప్రతినెల 2500 రూపాయలు జమ చేస్తామని తెలిపారు. పింఛను 4000 రూపాయలకు పెంచుతామని ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. పసుపు పంటకు 12000 నుండి 15వేల వరకు మద్దతు ధర కల్పిస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. యువ వికాసం పథకం ద్వారా విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డులు అందిస్తామని ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు ఉత్కం నర్సాగౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. : కాంగ్రెస్ లో భారీ చేరికలు నవతెలంగాణ భీంగల్ మండలంలోని బెజ్జోరా కుప్పల్ భీమ్గల్ బడా భీంగల్ గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ పార్టీ కండువా కప్పి సాగరంగా ఆహ్వానించారు . బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ గెలుపు నాకు నిరంతరం కృషి చేస్తామని పార్టీలో చేరిన వారికి సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు ఉన్నారు

Spread the love