నవతెలంగాణ – ఆర్మూర్
రక్ష స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యములో పట్టణం లోని జిరాయత్ నగర్ విద్యా హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన అవ్వకు బువ్వ కార్యక్రమములో ప్రతి నెలలో భాగంగా సోమవారం అతి నిరుపేద వృద్దులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా దాదాపు 65 మంది పేదవృద్దులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ అవ్వకు బువ్వ కార్యక్రమం ద్వారా అతినిరుపేద వృద్దుల ఆకలి తీర్చడానికి తమవంతు కృషి చేస్తున్నాం. రక్షా స్వచ్చంధ సేవా సంస్థ తరపున రాబోయే రోజుల్లో మరిన్ని సేవాకార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేష్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు జిందం నరహరి, ఎస్ జి శ్రీకాంత్, కోశాధికారి గొనె శ్రీధర్, కార్యనిర్వహక కార్యదర్శులు తులసి పట్వారి, ఖాందేష్ సత్యం, సభ్యులు ఖాందేష్ గంగాధర్, ప్రవీణ్, ఖోడే శ్రీనివాస్, మక్కల సాయి కుమార్, బండారి నరేశ్, మహేష్, శ్రీను రాజేష్, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు .
విద్య హైస్కూల్ లో నిరుపేదలకు బియ్యం పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



