నవతెలంగాణ హైదరాబాద్: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లొండలోని బొట్టుగూడలో ‘కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన పాఠశాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..”సరైన విద్య అందితేనే పేదల సమస్యలు తొలగుతాయన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తొలి పదేండ్లలో మన సమస్యలు తీరలేదు” అని అన్నారు. స్కూల్లో కంప్యూటర్లు, డిజిటల్ బోర్డులు, క్రీడా సదుపాయాలు కల్పించామని వివరించారు. అయితే, విద్యార్థులకు మార్కులు బాగా వస్తున్నా… ఉద్యోగాల సమయంలో అవసరమైన నైపుణ్యాలు (స్కిల్స్) లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బొట్టుగూడ స్కూల్ను ఒక మోడల్ స్కూల్గా తీర్చిదిద్దుతామని, దేశంలో ఎక్కడా ఇలాంటి ప్రభుత్వ పాఠశాల లేదని, మరెక్కడా కనిపించదని ఆయన గర్వంగా చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో పేదల సమస్యలు తీరలేదు: మంత్రి కోమటిరెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



