- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో అజ్మీరా సారమ్మకు చెందిన రూ.60 వేలు విలువైన పాడి గేదె మృత్యువాత చెందిన సంఘటన మండలం పెద్దతూండ్ల గ్రామ పరిధిలోని గాదంపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, బాధితురాలు కథనం ప్రకారం రోజులాగే మంగళవారం ఉదయం గేదె మేతకు వెల్లిందని తెలిపారు. మేత మేస్తున్న క్రమంలో విద్యుత్ తీగ షార్ట్స్ర్క్యూటై ప్రమాదవశాత్తు చనిపోయిందని కన్నీరుమున్నీరైయ్యారు. గేదె మృతి చెందడంతో తన ఉపాది కోల్పోయిందని, ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంది.
- Advertisement -



