నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ మలిదశ ఉద్యమ కెరటం బెల్లి లలితక్క విగ్రహం మొట్టమొదటగా భువనగిరిలో స్థాపించుకోవాలని కోరుతూ మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని బెల్లి లలితక్క విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో కలిశారు.ఈ సందర్భంగా సమన్వయకర్తలు మాట్లాడుతూ బెల్లి లలితక్క విగ్రహ కమిటీ గతంలో నిర్ణయించుకున్న విధంగా అతి త్వరలో శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విగ్రహ కమిటీ సమన్వయకర్తలు బెల్లి లలితక్క కుమారుడు సూర్యప్రకాష్, జన్ని వెన్నెల, భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్,వైస్ చైర్మన్ పోతంశట్టి మంజుల వెంకటేశ్వర్లు, భట్టు రాంచంద్రయ్య,మాజీ ఎంపీపి నరాల నిర్మల వెంకట్ స్వామి, మున్సిపల్ కౌన్సిలర్లు పొత్నక్ ప్రమోద్ కుమార్,తోటకూర వెంకటేష్ యాదవ్ పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్, గ్రంధాలయ చైర్మన్ అవైస్,మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా బాబురావ్, మర్రిపల్లి శ్రీనివాస్,ర్యాకల రమేష్,కాషపాక మహేష్, ఏడుమేకల మహేష్, నరాల జంగయ్య, ఎల్లంల జంగయ్య, కూకుంట్ల శ్రీశైలం, రాసల బాలస్వామీ, బింగి ఐలయ్య, పాశం నవీన్ కుమార్ రాసాల నర్సింహా, చిలుకల రమేష్, మహేష్, గుంటి పవన్, శ్రీరామ్ మురళీకృష్ణ, ఊదరి బాలు,ఒర్రె నర్సింహా, కొత్త భరత్, శట్టి రాములు, ఏనుగు మల్లారెడ్డి మరియు పట్టణ నాయకులు, వివిధ సంఘాల నాయకులు, విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
భువనగిరి ఎమ్మెల్యేను కలిసిన బెల్లి లలితక్క విగ్రహ కమిటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



