Wednesday, May 20, 2026
E-PAPER
Homeజాతీయంపాకిస్తాన్‌ కరెన్సీ కంటే భారత రూపాయి తగ్గుదల

పాకిస్తాన్‌ కరెన్సీ కంటే భారత రూపాయి తగ్గుదల

- Advertisement -

మరో రికార్డ్‌ కనిష్టానికి రూపీ
న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ రూపాయి కరెన్సీతో పోల్చినా భారత కరెన్సీ భారీ తగ్గుదలను చవి చూసింది. గడిచిన ఏడాది కాలంలో పాకిస్తాన్ రూపాయి (పికెఆర్‌)తో పోలిస్తే భారత కరెన్సీ క్షీణతను చవి చూసింది. 2025 మే 15 మార్పిడి రేటు ప్రతి ఒక భారత రూపాయికి 3.2913 పాకిస్తాన్ రూపాయలుగా ఉండగా, 2026 మే 18 నాటికి అది 2.9010 పాకిస్తాన్ రూపాయలకు బలపడింది. దీంతో పోల్చితే భారత కరెన్సీ దాదాపు 11.86 శాతం క్షీణతను చవి చూసింది. ఈ ​ భారతదేశ ఆర్థిక సవాళ్లు కేవలం అంతర్జాతీయంగా డాలర్ బలోపేతం కావడం వల్లనో లేదా పశ్చిమాసియా సంక్షోభం కారణంగానో మాత్రమే జరగడం లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని దేశీయ విధానాలు, ఆర్థిక నిర్వహణలో ఉన్న ప్రాథమిక లోపాలను ఈ గణాంకాలు ఎత్తిచూపుతున్నాయి. భారతీయ రూపాయి 2025లో ఆసియాలోనే అత్యంత అధ్వాన్నమైన ప్రదర్శన కనబరిచిన కరెన్సీగా నిలిచింది. ప్రస్తుత సంవత్సరంలో కూడా అదే పరిస్థితిని కొనసాగిస్తోంది. ఇదే కాలంలో బంగ్లాదేశ్ టాకాతో పోలిస్తే కూడా భారత రూపాయి బలహీనపడింది. రూపాయికి 1.42 టాకాలుగా ఉన్న రేటు 1.28 టాకాలకు పడిపోయింది.

ఇది ఈ సంవత్సరంలో దాదాపు 10 శాతం పతనానికి సమానం. ముడి చమురు ధరలు, విదేశీ మూలధనం నిరంతరాయంగా బయటకు తరలిపోవడం, అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల మంగళవారం భారతీయ రూపాయి మరోసారి చారిత్రాత్మక కనిష్టానికి పతనమయ్యింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి ఒకేరోజు 32 పైసలు క్షీణించి 96.52 వద్ద ముగిసింది. అంతకుముందు సోమవారం ఇది 96.20 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ట్రేడింగ్ ముగిసే సమయానికి కొంత కోలుకున్నప్పటికీ.. ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూపాయి ఎన్నడూ లేని విధంగా 96.60 మార్కును తాకింది. ఈ పతనంతో 2026 సంవత్సరంలో ఆసియాలోనే అత్యంత అధ్వాన్నమైన ప్రదర్శన కనబరిచిన కరెన్సీగా రూపాయి నిలిచింది. కేవలం ఈ నెలలోనే 1.5 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఏకంగా 7 శాతం కంటే ఎక్కువ విలువను కోల్పోయింది. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -