యూపీలో బెయిల్ పై విడుదల
పూల దండలు..కాళ్లకు
మొక్కుతూ హడావిడి
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ కరువు
లైంగికదాడి నిందితుడికి ఘన స్వాగతం
ఘజియాబాద్: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ లేకుండాపోతుందని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. నాడు గుజరాత్ లో బిల్కిస్ బానుపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన నిందితులు బెయిల్ పై విడుదల కాగా..వారిని వీరోచిత పోరాటం చేసిన యోధుల్లా కాషాయ మూకలు కీర్తిస్తున్న తీరు వివాదస్పదమవుతోంది. తాజాగా యూపీలో కూడా అలాంటి ఘటనే జరిగింది. లైంగికదాడి కేసులో 9 నెలల తర్వాత బెయిల్పై విడుదలైన నిందితుడికి ఘన స్వాగతం పలకడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జైలు గేటు నుంచి బయటకు అడుగు పెట్టగానే నిందితుడి మెడలో పూల దండలు వేసి, కరచాలనం చేస్తూ, కాళ్లకు మొక్కుతూ అతని అనుచరులు నానా హడావిడి చేశారు. అనంతరం భుజాలపై మోస్తూ ఊరేగింపు తీశారు. ఈ ఘటన దిల్లీ సమీప గాజియాబాద్లో ఈ నెల 17న చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వ్యాప్తిలోకి రాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సుశీల్ ప్రజాపతి.. హిందూ యువ వాహిని మాజీ సభ్యుడు. న్యాయవాదిని పరిచయం చేస్తానంటూ ఒక న్యాయవిద్యార్థినిని ఫ్లాట్కు తీసుకెళ్లిన సుశీల్ ప్రజాపతి అనంతరం ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
లైంగికదాడి నిందితుడికి ఘన స్వాగతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



