- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధాని మోడీ నేడు (గురువారం) సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని సేవా తీర్థ్లో కేంద్ర మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులందరూ రాజధానిలోనే ఉండాలని పీఎంవో ఆదేశించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఆయిల్ సప్లై, ఇంధన ధరల పెంపు ఎఫెక్ట్ తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 10న మోడీ 3.0 ప్రభుత్వ వార్షికోత్సవం నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ, మార్పులపైనా చర్చించే చేసే అవకాశముంది.
- Advertisement -



